ఏపీ: 9597 పాజిటివ్‌‌, 93 మంది మృతి | Coronavirus 9597 Positive Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ: 9597 పాజిటివ్‌‌, 93 మంది మృతి

Aug 12 2020 6:19 PM | Updated on Aug 12 2020 8:32 PM

Coronavirus 9597 Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146 కు చేరింది.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146 కు చేరింది. తాజా పరీక్షల్లో 32,837 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,311 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. అలాగే 6,676 మంది బుధవారం కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 93 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2296 కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 26,49,767 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
(ఏపీ: నెల రోజుల్లో 1.39 లక్షల మంది రికవరీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement