విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్‌ | CM YS Jaganmohan Reddy To Visit Visakha Saradha Peetham | Sakshi
Sakshi News home page

విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్‌

Feb 8 2022 4:27 AM | Updated on Feb 8 2022 8:59 AM

CM YS Jaganmohan Reddy To Visit Visakha Saradha Peetham - Sakshi

సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకుంటారు. ఒంటిగంట వరకు అక్కడ ఉంటారు. మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. 

Advertisement
 
Advertisement
Advertisement