సీఎం జగన్‌ నరసాపురం పర్యటన షెడ్యూల్‌ ఇదే..

CM YS Jagan Mohan Reddy Narasapuram Tour Schedule Details - Sakshi

తాడేపల్లి : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.  ఈమేరకు రేపటి సీఎం జగన్‌ నరసాపురం పర్యటన షెడ్యూల్‌ ఇలా ఉంది.

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి  ఉదయం 10.50 గంటలకు సీఎం జగన్‌ నరసాపురం చేరుకోనున్నారు.  ఉదయం గం. 11:15ని.ల నుంచి గం. 12.50ని.లవరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొనున్నారు.  అనంతరం మధ్యాహ్నం గం. 1.15ని.లకు బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top