సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. జూన్ నెల మొదటి మంగళవారమే ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు తెచ్చింది. తాజా అప్పుతో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3లక్షల 44వేల 494 కోట్లకు చేరాయి. ఫలితంగా చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
ఇక బాబు సర్కార్ గడిచిన 24 నెలల్లో రూ.3,44,494 కోట్లు అప్పు చేసింది. వాటిల్లో బడ్జెటరీ అప్పులు రూ.లక్షా 85వేల కోట్లు, బడ్జెట్ బయట రూ.1,15,504కోట్లు అప్పులు చేసింది. అమరావతి పేరుతో రూ.47,387కోట్ల అప్పులు ఉన్నాయి.


