ఈ నెల 31న కేబినెట్‌ భేటీ | Sakshi
Sakshi News home page

ఈ నెల 31న కేబినెట్‌ భేటీ

Published Fri, Jan 26 2024 4:37 AM

Andhra Pradesh Cabinet Meeting on January 31 - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌.జవహర్‌రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులకు తెలియజేశారు. ఈ సమావేశానికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలను 29వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సాధారణ పరిపా­లన(కేబినెట్‌) విభాగానికి పంపించాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024–­25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై మంత్రి మండలిలో చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావే­శాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రి మండలిలో చర్చించి నిర్ణ­యాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement