ప్రతిపక్షాలు విద్యా వ్యవస్థను రాజకీయం చేస్తున్నాయి: ఆదిమూలపు సురేష్‌

Adimulapu Suresh‌ Slams TDP Over Politicizing Education System - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 7 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4 కోట్ల మందికి తొలిడోసు, 3 కోట్లమందికి రెండో డోసు వేశామని పేర్కొన్నారు.  పాఠశాలల్లో టీచర్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని చెప్పారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు 95 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని పేర్కొన్నారు.

చదవండి: కరోనా కట్టడిపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై లోకేష్‌ అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఏ అంశమూ దొరక్క విద్యా వ్యవస్థ రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top