
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి( సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నటలు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) స్పష్టం చేసింది.
ఈ మేరకు ఓ లేఖ రాసింది ఆశా. హాస్పిటల్స్కి రూ. 2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించని కారణంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వారంలోగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరంది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు.