
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,610 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,18,247 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 114 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,800కు చేరింది. గడిచిన 24 గంటల్లో 23,098 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 12 లక్షల 99 వేల 313 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,09,134 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,83,42,918 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.