పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి బెయిల్ | Court Grants Bail to Pinnelli Venkatarami Reddy | Sakshi
Sakshi News home page

పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి బెయిల్

Mar 26 2026 7:30 PM | Updated on Mar 26 2026 7:54 PM

Court Grants Bail to Pinnelli Venkatarami Reddy

గుంటూరు:  కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన జంట హత్యల కేసుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ఈ మేరకు గురజాల కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ  అక్రమ కేసులో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి 106 రోజుల పాటు జైల్లో ఉన్నారు. రేపు గుంటూరు జైలు నుంచి వెంకటరామిరెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఇదే కేసుకు సంబంధించి గత వారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.  ఈ నెల 18వ తేదీన గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 99 రోజుల పాటు నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతవారం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో మాపై అక్రమ కేసు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారు. 

ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్త్‌లో మాకు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆరోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాము, ఎవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు’ అని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement