ఆత్మకూరు సమీపంలో వర్షం జాడ లేకపోవడంతో బీడుగా ఉన్న పొలాలు
వర్షాభావ పరిస్థితులు జిల్లాను కరువు కోరల్లోకి నెట్టేశాయి. ఇటీవల అరకొరగా కురిసిన వర్షాలకు పొలాల్లో రైతులు విత్తు వేశారు. ఆ తర్వాత చినుకు జాడ లేకుండా పోయింది. ఫలితంగా భూమిలో వేసిన విత్తనం ఒట్టిపోయింది. మూగజీవాలకు సైతం గ్రాసం కరువైంది. తాగునీటికి అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
ఆత్మకూరు సమీపంలో ఎండు ముఖం పట్టిన పంటలు
పచ్చి గడ్డి కోసం పొలాల్లో వెతుకుతున్న జీవాలు


