మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

మహిళ దుర్మరణం

Jul 28 2025 7:55 AM | Updated on Jul 28 2025 7:55 AM

మహిళ

మహిళ దుర్మరణం

గుమ్మఘట్ట: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడిన ఘటనలో గుమ్మఘట్ట మండల కో–ఆప్షన్‌ సభ్యుడు హిదతుల్లా తల్లి మసీదా బేగం (55) దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన మేరకు.. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం తన మనవడితో కలసి ద్విచక్రవాహనంపై కణేకల్లులో ఉన్న కుమార్తెను చూసి వచ్చేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో రాయదుర్గం మండలం కదరంపల్లి వద్దకు చేరుకోగానే మసీదాబేగం చీర కొంగు వాహనం చక్కానికి చుట్టుకోవడంతో అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆ గ్రామానికి చేరుకుని మసీదా బేగం మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ గౌని లక్ష్మీకాంత రెడ్డి, కాంట్రాక్టర్‌ ఆర్టీ లక్ష్మీకాంతారెడ్డి, హేమారెడ్డి, స్వామి, చమ్మా ఇబ్రహీం తదితరులు ఉన్నారు.

మహిళ దుర్మరణం1
1/1

మహిళ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement