గందరగోళంగా సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

గందరగోళంగా సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్‌

Jun 30 2025 4:09 AM | Updated on Jun 30 2025 4:09 AM

గందరగ

గందరగోళంగా సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్‌

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లోని సర్వే, భూరికార్డుల శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్‌ గందరగోళంగా మారింది. సీనియార్టీ జాబితాపై గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర నాయకులు అడ్డుచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాయినింగ్‌ డేట్‌ ఆధారంగా జాబితా ఎలా ఇస్తా రంటూ సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్‌తో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్‌నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇతర శాఖలు, జిల్లాల్లో మాదిరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ర్యాంక్‌ ఆధారంగా జాబితా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాదంటే కౌన్సెలింగ్‌ను బాయ్‌ కాట్‌ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. పరిస్థితిని డీఆర్‌ఓ మలోల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన సర్వే శాఖ కార్యాలయానికి చేరుకుని సీనియారిటీ జాబితాపై ఏడీలు రూప్లానాయక్‌, విజయశాంతిబాయి, సూపరింటెండెంట్‌ అయూబ్‌తో సమీక్షించారు. ఆయన సూచన మేరకు ర్యాంక్‌ ఆధారంగా సీనియారిటీ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ తతంగం కారణంగా ఉదయం 9 గంటలకు మొదలవ్వాల్సిన బదిలీ కౌన్సెలింగ్‌ ఆరు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.

సీనియార్టీ జాబితాపై

తీవ్ర అభ్యంతరం

ఆరు గంటలు ఆలస్యంగా

కౌన్సెలింగ్‌ ప్రారంభం

గందరగోళంగా సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్‌ 1
1/1

గందరగోళంగా సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement