తిరునాలలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

తిరునాలలో అపశ్రుతి

May 9 2025 1:44 AM | Updated on May 9 2025 1:44 AM

తిరునాలలో అపశ్రుతి

తిరునాలలో అపశ్రుతి

పెద్దవడుగూరు: బండిశూల తిరునాలలో అపశ్రుతి చోటు చేసుకొంది. వివరాలు.. గురువారం గుత్తి అనంతపురం, కాశేపల్లి మీదుగా పామిడి మండలం రామరాజు పల్లి వరకూ ఎద్దులతో సురబండిని లాగే కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కాడిమానుపై కూర్చొని ఎద్దులను తోలుతుండగా జి. వెంకటాంపల్లికి చెందిన సిద్దపు రాజు అదుపు తప్పి కింద పడ్డాడు. పాదాలపై బండి చక్రం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సల కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే పెద్దవడుగూరుకి చెందిన రైతులు తమ ఎద్దులను సురబండి లాగడానికి కట్టారు. ఈ క్రమంలో ఉన్నఫలంగా ఎద్దుల పట్టెడు తెగిపోయింది. అక్కడే ఉన్న రైతు నాగభూషణ ఎద్దును కట్టడి చేయడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేసింది. క్షతగాత్రుడికి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement