
జిల్లాలో మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవ
1 నుంచి ‘ఆంధ్రప్రదేశ్
గ్రామీణ బ్యాంకు’ అవతరణ
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయినట్లు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రీజనల్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయంలో ఆర్ఎం శ్రీదేవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులన్నీ ఒకటిగా విలీనం అవుతున్నాయన్నారు. మే ఒకటి నుంచి ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు’గా అవతరించనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్న నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఖాతానెంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచి చిరునామాల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదన్నారు. అన్ని డిపాజిట్ ఖాతాలు, రుణాలు, సేవలు, చెక్బుక్కులు, పాస్బుక్కలు, ఏటీఎం కార్డులు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. కేవలం వడ్డీరేట్లలో కొంత వ్యత్యాసం ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్లు చైతన్యకుమార్, శ్రీధర్, శివకుమార్, శేషసాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: ఎస్కేయూ పరిధిలో బీపీఈడీ రెండో సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత మంగళవారం విడుదల చేశారు. మొత్తం 63.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ లోకేశ్వర్లు, ఎస్కేయూ న్యాయశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవ