
ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా చేయండి
అనంతపురం అర్బన్: నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్తో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్లాస్టిక్ నిషేధం అమలుకు సంబంధించి పట్టణాల్లో వార్డుస్థాయి కమిటీలను 24 గంటల్లోపు నియమించాలన్నారు. నగరంలో 56 ట్రేడర్స్ని ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిరంతరం తనిఖీ చేయాలన్నారు.
● ఉపాఽధి కూలీల సంఖ్య పెంచాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ప్రతి రోజు 1.05 లక్షల మందికి పనులు కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. డ్వామా పీడీ సలీమ్బాషా, జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
● జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్టు, ఏపీ జెన్కో, రిలయన్స్ బయోగ్యాస్, ఎంఎస్ఎంఈ పార్కులు, డంపింగ్ యార్డ్, కమ్యూనిటీ భవనాలు, 4జీ మోబైల్, డీఎల్డీఓ కార్యాలయం, తదితర ప్రాజెక్టులకు భూ బదలాయింపు, భూమి అప్పగింతకు సంబంధించి పెండింగ్ ప్రతిపాదనలు పంపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భూ బదలాయింపు అంశంపై సోమవారం కలెక్టరేట్లో జేసీతో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.