భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే భయపడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే భయపడుతున్నారు

Apr 27 2025 1:01 AM | Updated on Apr 27 2025 1:01 AM

భానుడ

భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను

శనివారం మధ్యాహ్నం

నిర్మానుష్యంగా కనిపిస్తున్న

అనంతపురంలోని టవర్‌ క్లాక్‌ ప్రాంతం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు భగ భగ మండిపోతున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో 40 డిగ్రీల లోపు ఉన్న ఉష్ణోగ్రతలు తాజాగా 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ వేడిమికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పట్టణాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పల్లెటూళ్లలో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఎండదెబ్బకు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లి ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బ కేసులు పెరుగుతున్నట్లు ఆస్పత్రుల రికార్డులు వెల్లడిస్తున్నాయి.

45 డిగ్రీలు దాటే అవకాశం

గత ఏడాది ఇదే సమయానికి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈసారి మాత్రం అప్పుడే 42 డిగ్రీలు నమోదైంది. రానున్న నెలన్నర రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే రెండో వారం నుంచి ఎండ తీవ్రత మరింతగా ఉంటుందని, వడదెబ్బ ప్రభావం తారస్థాయికి చేరుకుంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు మధ్యాహ్నం పూట బయటకు రావద్దని, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని వాళ్లు కూడా ఎండల్లో తిరగకూడదంటున్నారు.

భారీగా పెరిగిన

పగటి ఉష్ణోగ్రతలు

ఏప్రిల్‌లోనే 42 డిగ్రీలను దాటుతున్న వైనం

మేలో 45 డిగ్రీల వరకూ వెళ్లే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు

వృద్ధులు, బాలింతలు, చిన్నారులు బయటకు రావద్దంటున్న వైద్యులు

ఈసారి ఎండలు ఎక్కువే

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. మేలో 45 డిగ్రీల వరకూ నమోదు కావచ్చు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉక్కపోత (హ్యుమిడిటీ) తక్కువ. ఈ ఏడాది కాస్త ముందస్తు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. – విజయశేఖర్‌, సైంటిస్ట్‌,

రేకులకుంట వాతావరణ కేంద్రం

వడదెబ్బ లక్షణాలు

విపరీతమైన తలనొప్పి, వాంతికి వచ్చినట్లు ఉండటం

నాలుక తడి ఆరిపోయినట్లు ఉండటం

శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరగడం

శరీరం బాగా అలసిపోయినట్లు ఉండటం

మాట తడబడుతున్నట్లు ఉండటం

ఒక్కోసారి కండరాలు పట్టేసినట్టు అనిపించడం

వెంటనే నీరసం వచ్చేసి ఎక్కడైనా వాలిపోవాలనిపించడం

శరీరం తిమ్మిరిగా అనిపించడం

భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను1
1/1

భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. వడగాల్పులు ప్రజలను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement