విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు
గోపాలపట్నం(విశాఖ): భారత్, శ్రీలంక మహిళా క్రికెట్ జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఈ నెల 21, 23 తేదీల్లో ఇక్కడ జరగనున్న టీ–20 మ్యాచ్ల్లో పాల్గొనేందుకు ఇరుజట్ల క్రీడాకారిణులు నగరానికి విచ్చేశారు. వీరికి విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ మ్యాచ్లు పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గంలో తమకు కేటాయించిన హోటళ్లకు చేరుకున్నారు.


