అమరజీవి ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

అమరజీవి ఆశయ సాధనకు కృషి

Dec 16 2025 4:30 AM | Updated on Dec 16 2025 4:30 AM

అమరజీవి ఆశయ సాధనకు కృషి

అమరజీవి ఆశయ సాధనకు కృషి

అనకాపల్లి: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయసాధనకు యువత కృషి చేయాలని అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, తన ప్రాణాలను త్యాగం చేసి చరిత్రలో అమరజీవిగా నిలిచిపోయారన్నారు. కార్యాలయం పరిపాలనాధికారి సి.హెచ్‌.తిలక్‌ బాబు, సీఐలు లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, ఎస్‌ఐ సురేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement