జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ జాతీయ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ జాతీయ అవార్డులు

Dec 15 2025 8:50 AM | Updated on Dec 15 2025 8:50 AM

జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ జాతీయ అవార్డులు

జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ జాతీయ అవార్డులు

అవార్డులు అందుకుంటున్న జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డీవీ రమణమూర్తి,

పీఆర్వో నాగేశ్వరరావు

డాబాగార్డెన్స్‌: పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్‌ రిలేషన్స్‌ కాన్ఫరెన్స్‌–2025లో జీవీఎంసీ మూడు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సాధించింది. ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. ‘ఎంపవరింగ్‌ గ్రోత్‌, ప్రిజర్వింగ్‌ రూట్స్‌, పీఆర్‌ విజన్‌ ఫర్‌ 2047’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళా సాధికారత, ఆర్థిక బలోపేతం, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఉత్తరాంఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, శాసనసభ స్పీకర్‌ రీతూ ఖండూరీ భూషణ్‌ చేతుల మీదుగా జీవీఎంసీ తరఫున అదనపు కమిషనర్‌ డీవీ రమణమూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్‌. నాగేశ్వరరావు అవార్డులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement