అంతర్జాతీయ పోటీల్లో లింగేశ్వరరావుకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పోటీల్లో లింగేశ్వరరావుకు పతకాలు

Nov 27 2025 6:09 AM | Updated on Nov 27 2025 6:09 AM

అంతర్జాతీయ పోటీల్లో లింగేశ్వరరావుకు పతకాలు

అంతర్జాతీయ పోటీల్లో లింగేశ్వరరావుకు పతకాలు

ఉక్కునగరం : అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీల్లో స్టీల్‌ప్లాంట్‌ మాజీ ఉద్యోగి లింగేశ్వరరావుకు రెండు విభాగాల్లో బంగారు, రజత పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో థాయ్‌లాండ్‌లోని పటాయలో ఈ నెల 21 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్‌ బాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2025 పోటీలు నిర్వహించారు. 35 ఏళ్లు నుంచి 75 ఏళ్లు వరకు వయసు కలిగిన క్రీడాకారులకు నిర్వహించిన ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్‌ నుంచి పాల్గొన్న లింగేశ్వరరావు 55+ మిక్స్‌డ్‌ డబుల్స్‌ కేటగిరీలో తమిళనాడుకు చెందిన సుజానే వింగ్‌లెట్‌తో పాల్గొని బంగారు పతకం గెలుపొందారు. మెన్‌ డబుల్స్‌ కేటగిరీలో తమిళనాడుకు చెందిన కార్తికేయన్‌ వాసుతో పాల్గొని రజత పతకం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement