లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం

Jul 6 2025 6:47 AM | Updated on Jul 6 2025 6:47 AM

లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం

లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం

లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న పదో అదనపు జిల్లా జడ్జి నరేష్‌

అనకాపల్లి టౌన్‌: కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లు ఉపకరిస్తాయని, లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పదో అదనపు జిల్లా జడ్జి నరేష్‌ తెలిపారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఎదురైన గొడవలతో కేసులు పెట్టుకుని కాలంతో పాటు ఆర్థికంగా నష్టపోకూడదని వివరించారు. కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కక్షిదారుల ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు ఈ అదాలత్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు, అడిషనల్‌ సబ్‌ కోర్టు న్యాయమూర్తి రామకృష్ణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిల్లా హర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement