
బాబా అణు పరిశోధన కేంద్రంలో మాక్ డ్రిల్
అచ్యుతాపురం రూరల్: గడిచిన రెండు రోజులుగా బాబా అణు పరిశోధన కేంద్రంలో ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఎస్పీ తుహిన్ సిన్హా సూచనల మేరకు డీఎస్పీలు బి.కృష్ణ, బి.మధుసూదనరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. రాంబిల్లి సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం బార్క్లో అకస్మాత్తుగా ఎప్పుడైనా తీవ్రవాదులు దాడి చేసినప్పుడు సంసిద్ధతతో ప్రతి స్పందన వ్యూహాలను అంచనా వేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించారన్నారు. ఉగ్రవాద దాడి సమయంలో పోలీస్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశామన్నారు. బార్క్ అధికారి ఎన్విడి ప్రసాద్, ఆర్ఐ వరప్రసాద్, ఆర్ఐ రామ్మోహన్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.