వర్షాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

వర్షాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు

May 30 2025 1:29 AM | Updated on May 30 2025 1:29 AM

వర్షాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు

వర్షాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు

సింహాచలం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సింహగిరికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం ఈవో వి.త్రినాథరావు గురువారం పరిశీలించారు. స్వామి దర్శనానికి భక్తులు వెళ్లే ఉచిత, రూ.100, రూ.300 క్యూల్లో నడుస్తూ ఎక్కడెక్కడ వర్షం నీరు వస్తోందో ఆయా ప్రాంతాలను గుర్తించారు. నీరు భక్తులపై పడకుండా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ప్రసాదాల విక్రయశాలకు వెళ్లి, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. భక్తులతో మార్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ప్రసాదాల నిల్వ గది ఇరుగ్గా ఉండటంతో, ప్రత్యామ్నాయ గదిలోకి మార్చాలన్నారు. ప్రసాదాల నాణ్యతలో అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement