భరోసా పార్టీ అధినేతపై దుండగుల దాడి | - | Sakshi
Sakshi News home page

భరోసా పార్టీ అధినేతపై దుండగుల దాడి

May 19 2026 12:40 AM | Updated on May 19 2026 1:06 PM

నీరుతోటపాలెం సమీపంలో ఘటన

గూడెంకొత్తవీధి: భరోసా పార్టీ అధినేత డాక్టర్‌ ధార అభినయ్‌ దసన్‌పై మండలంలో మొండిగెడ్డ పంచా యతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.కడపకు చెందిన అభినయ్‌ కొన్ని రోజులుగా జిల్లా లో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్‌, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్‌పై బ్లేడుతో దాడి చేశారు. తల,కాళ్లపై కోసేశారు. 

అభినయ్‌తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్‌ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్‌ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్‌కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్‌ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement