పిడుగుపాటుకుగిరిజన రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకుగిరిజన రైతు మృతి

Apr 5 2026 8:00 AM | Updated on Apr 5 2026 8:00 AM

రంగబయలులో విషాదం

ముంచంగిపుట్టు: మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన రంగబయలు పంచాయతీలో ప్రకృతి ప్రకోపానికి ఒక గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగబయలు గ్రామానికి చెందిన సీసా గాసి (68) అనే గిరిజన రైతు శుక్రవారం సాయంత్రం తన పొలంలో పనులు చేసుకుంటుండగా, ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆయన సమీపంలోని ఒక చెట్టు నీడకు వెళ్లారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడటంతో, గాసి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఆ దారి వెంబడి వెళ్తున్న స్థానికులు గమనించి ఆయనను గ్రామానికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచారు. కష్టపడి పనిచేసే వయసు మళ్లిన రైతు ఇలా అకాల మరణం చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న వైస్‌ ఎంపీపీ భాగ్యవతి, సర్పంచ్‌ దనియా, మండల వైఎస్సార్‌సీపీ నేతలు దేవా, బలరాజు శనివారం రంగబయలు గ్రామాన్ని సందర్శించారు. గాసి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement