హామీలు అమలుపైదశలవారీగా ఆందోళన | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలుపైదశలవారీగా ఆందోళన

Jan 31 2026 6:38 AM | Updated on Jan 31 2026 6:38 AM

హామీలు అమలుపైదశలవారీగా ఆందోళన

హామీలు అమలుపైదశలవారీగా ఆందోళన

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు

పెదబయలు: ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు సీకరి శేషగిరిరావు తెలిపారు. గురువారం ఆయన డిప్యూటీ తహసీల్దార్‌ రంగారావుకు పలు డిమాండ్లతో కూడిన వినతపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో పోరాటం జరిపేందుకు పిలుపునిచ్చామన్నారు. ఈ నెల 30న తహసీల్దార్లకు వినతిపత్రం ఇవ్వడం, వచ్చేనెల 10న కలెక్టరేట్ల ముట్టడి, అదే నెల 25న చలో విజయవాడ చేపడతామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement