వణికిస్తున్న శీతల గాలులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న మంచు, చలి ప్రభావం కొనసాగుతోంది. మన్యం వాసులు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. మంగళవారం ముంచంగిపుట్టులో 8.0 డిగ్రీలు, పెదబయలులో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు
నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 9.7, హుకుంపేటలో 11.1 డిగ్రీలు, పాడేరులో 11.5 డిగ్రీలు, అరకువ్యాలీలో 12.0 డిగ్రీలు, చింతపల్లిలో 13.5 డిగ్రీలు, అనంతగిరిలో 13.9 డిగ్రీలు, కొయ్యూరులో 14.1 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.
●పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధి మారేడుమిల్లిలో 11.3 డిగ్రీలు, వై.రామవరంలో 11.7 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.7డిగ్రీలు, అడ్డతీగలలో 15.8 డిగ్రీలు, రంపచోడవరంలో 16.4 డిగ్రీలు, చింతూరు డివిజన్చింతూరులో 15.2 డిగ్రీలు, ఎటపాకలో 16.5 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటలు దాటే వరకు భానుడు కనిపించడం లేదు. మంచు తెరలు రహదారులను కమ్మేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.


