అప్పన్నకు ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం జరిపారు. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వ క్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదిత ర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఘనంగా గరుడసేవ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తరశతనామావళి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష హారతులు అందించారు.


