పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం

Dec 16 2025 4:30 AM | Updated on Dec 16 2025 4:30 AM

పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం

పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం

సాక్షి, పాడేరు: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం,స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో అంబేడ్కర్‌,ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు,కలెక్టరేట్‌ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement