పచ్చకామెర్లతోఉపాధ్యాయిని మృతి | - | Sakshi
Sakshi News home page

పచ్చకామెర్లతోఉపాధ్యాయిని మృతి

Nov 6 2025 7:54 AM | Updated on Nov 6 2025 7:54 AM

పచ్చకామెర్లతోఉపాధ్యాయిని మృతి

పచ్చకామెర్లతోఉపాధ్యాయిని మృతి

అనకాపల్లి టౌన్‌: రపభుత్వ వేధింపులతో ఒక ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయింది. పట్టణంలోని గవరపాలెంలో నివాసముంటున్న భవాని (48) మునగపాక మండలం సిరసపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంటీఎస్‌ టీచర్‌గా పనిచేసేవారు. ఆమెను అర్ధంతరంగా అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని ఓ మారుమూల పాఠశాలకు బదిలీ చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆమె పచ్చకామెర్ల వ్యాధికి గురై మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. మైదాన ప్రాంతాలకు చెందిన కొంతమంది టీచర్లను ఈ ఏడాది జూన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన భవాని ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. టీచర్లకు సరైన సదుపాయలు కల్పించకుండా బదిలీలు చేయడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement