పిడుగుపాటుకు ఆరు ఎద్దులు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఆరు ఎద్దులు మృతి

Oct 11 2025 6:12 AM | Updated on Oct 11 2025 6:12 AM

పిడుగుపాటుకు ఆరు ఎద్దులు మృతి

పిడుగుపాటుకు ఆరు ఎద్దులు మృతి

ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామ సమీపంలో శుక్రవరం సాయంత్రం పిడుగుపాటుకు ఆరు దూక్కటేద్దులు మృతి చెందాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అరబీరు గ్రామానికి చెందిన ఎద్దులు, ఆవులు, మేకలను మేత కోసం కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్లి సాయంత్రం గ్రామానికి తీసుకు వస్తున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఎద్దులపై పిడుగు పడంతో అక్కడికి అక్కడే ఆరు దుక్కటేద్దులు మృతి చెందాయి. కాపరులు పిడుగుపాటుకు పరుగులు పెట్టారు. అరబీరు గ్రామానికి చెందిన కిరసాని జయరాంకు చెందిన నాలుగు, బలరాంకు చెందిన ఒకటి, సీతారాంకు చెందిన ఒకటి చొప్పున ఎద్దులు మృతి చెందాయి. ఒక్కో ఎద్దు రూ.30వేలు విలువ చేస్తుందని, ఎద్దులు మృతితో తీవ్ర నష్టపోయామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement