ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నా | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నా

Jul 26 2025 9:20 AM | Updated on Jul 26 2025 9:20 AM

ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నా

ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నా

మూడు రోజులుగా జ్వరంగా వుండడంతో గ్రామంలో మందులు వేసుకున్నా. అయినప్పటికీ తగ్గకపోవడంతో గురువారం చింతూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాను. రక్తపరీక్ష చేసి మలేరియా జ్వరంగా చెప్పారు. ఆస్పత్రిలో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నా.

– ముచ్చిక సంతోష్‌,

సరివెల, చింతూరు మండలం

మెరుగైన చికిత్స అందిస్తున్నాం

వాతావరణ మార్పుల నేపథ్యంలో చింతూరు డివిజన్లో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు చింతూరు డివిజన్లోని 8 పీహెచ్‌సీల్లో 515 మలేరియా కేసులు నమోదయ్యాయి. హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ చర్యలు చేపడుతున్నాం. మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నాం.

– డాక్టర్‌ పుల్లయ్య,

డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, చింతూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement