
సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
● డీఆర్వో పద్మలత
● 105 వినతుల స్వీకరణ
పాడేరు : వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు నిశితంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో కె. పద్మలత అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావుతో కలిసి ఆమె పలు ప్రాంతాల నుంచి అర్జీదారుల నుంచి 105 వినతులను స్వీకరించారు. పక్కా గృహాలు మంజూరు చేయాలని, బీటీ రోడ్లు నిర్మించాలని, తాగునీటి సమస్య పరిష్కారించాలని, ఏకలవ్య, గిరిజన గురుకుల పాఠశాలల్లో గిరిజన విద్యార్ధులకు సీట్లు ఇప్పించాలని, వంతెనలు నిర్మించాలని తదితర సమస్యలపై వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, డ్వామా పీడీ విద్యసాగర్, సర్వే, లాండ్స్ ఏడీ దేవేంద్రుడు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు రమేష్కుమార్రావు, పరిశ్రమల శాఖ ఏడీ రమణరావు, పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ నర్శింహులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బీఎస్ఎస్ నంద్ పాల్గొన్నారు.