ఉక్కు ఉద్యోగులను ఢీకొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ వాహనం | - | Sakshi
Sakshi News home page

ఉక్కు ఉద్యోగులను ఢీకొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ వాహనం

Jun 12 2025 3:15 AM | Updated on Jun 12 2025 3:15 AM

ఉక్కు

ఉక్కు ఉద్యోగులను ఢీకొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ వాహనం

ఇద్దరికి గాయాలు

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లోని ఈడీ (వర్క్స్‌) బిల్డింగ్‌ ఎదురుగా ఉన్న మిల్స్‌ కూడలి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. సీఐఎస్‌ఎఫ్‌ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి. వడ్లపూడి ప్రాంతానికి చెందిన సీరాపు సత్తిబాబు, నెమలికంటి రామారావు స్టీల్‌ప్లాంట్‌లోని వైర్‌ రాడ్‌ మిల్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం ‘ఏ’షిఫ్ట్‌ విధులకు హాజరయ్యేందుకు వారిద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మిల్స్‌ కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా అదే సమయంలో సెంట్రల్‌ స్టోర్స్‌ జంక్షన్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. సత్తిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రా మారావుకు ఉక్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉక్కు ఉద్యోగులను ఢీకొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ వాహనం 1
1/1

ఉక్కు ఉద్యోగులను ఢీకొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ వాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement