
రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం
పాడేరు : ఎబిలిటీ పీపుల్ రిహాబిలిటేషన్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. స్థానిక జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిజియోధెరఫి, అక్యుపేషనల్ ధెరఫి, ప్రోస్టేటిక్స్ థెరపి తదితర సేవలు పొందవచ్చన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఫౌండర్ దిలీప్ పాత్రో ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ టి. నర్సింగరావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, ఎబిలిటీ పీపుల్ రిహాబిలిటేషన్ కేంద్రం సీఈవో వంశీ తదితరులు పాల్గొన్నారు.