94 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

94 కిలోల గంజాయి పట్టివేత

May 31 2025 1:35 AM | Updated on May 31 2025 1:35 AM

94 కి

94 కిలోల గంజాయి పట్టివేత

కొయ్యూరు: మండలంలోని చీడిపాలెం పంచాయతీ మునసలపాడులో శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసలు 79.47 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చీడిపాలెం జంక్షన్లో ఎస్‌ఐ వాహన తనిఖీలు చేపట్టారు. చాపరాతిపాలెం, బూదరాళ్ల మీదుగా మైదన ప్రాంతానికి బయలుదేరిన కారును తనిఖీ చేయగా 79.47 కిలోల గంజాయి పట్టుబడింది. అన్నమయ్య జిల్లా పెద్దపాలెంకు చెందిన చినమేకల శ్రీనివాస్‌ గంజాయిని బెంగళూరు తరలిస్తున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని ఎస్‌ఐ తెలిపారు. గంజాయి, కారును సీజ్‌ చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

మోతుగూడెం: స్థానిక చెక్‌పోస్టు వద్ద శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ సాధిక్‌ తెలిపారు. ఒడిశా రాష్ట్రం పసుపులంక గ్రామానికి దగ్గరలో ఉన్న దొండపూడి నుంచి తీసుకువస్తున్నట్టు గుర్తించామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. సూర్యాపేట, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన నిందితులు హరికృష్ణ, నవీన్‌, సిద్దిపేట రాజేష్‌, కుమ్మరి సిద్ధూ, సీహెచ్‌ సురేష్‌, పాల్వాయి అంజిపై కేసు నమోదు రిమాండ్‌కు తరలించామని ఆయన వివరించారు. వీరి నుంచి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.

94 కిలోల గంజాయి పట్టివేత 1
1/1

94 కిలోల గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement