ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

May 31 2025 1:35 AM | Updated on May 31 2025 1:35 AM

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

పాడేరు : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో పద్మలతతో కలిసి ప్రజల నుంచి 151 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. జూన్‌ 4న అరకు గిరిజన మ్యూజియం, రంపచోడవరంలో ఐదువేల మంది గిరిజనులతో, 11న చాపరాయి జలతరంగిని వద్ద, 17న మారేడుమిల్లిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి లవరాజు, డీఎల్‌పీవో కుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ జవహర్‌బాబు, పంచాయతీరాజ్‌ ఈఈ కొండయ్యపడాల్‌, టీడబ్ల్యూ ఈఈ వేణుగోపాల్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమేష్‌కుమార్‌రావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

151 వినతుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement