వ్యాన్‌పై నుంచి జారిపడి ఇద్దరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

వ్యాన్‌పై నుంచి జారిపడి ఇద్దరికి తీవ్ర గాయాలు

May 29 2025 7:12 AM | Updated on May 29 2025 7:12 AM

వ్యాన

వ్యాన్‌పై నుంచి జారిపడి ఇద్దరికి తీవ్ర గాయాలు

వై.రామవరం : మండలంలోని రాచపాలెం గ్రామ సమీపంలో బుధవారం వ్యాన్‌న్‌పై నుంచి రోడ్డుపై జారిపడి మండలంలోని పి.యర్రగొండ గ్రామానికి చెందిన కిచ్చలి రామకృష్ణారెడ్ది(36), పల్లాల శ్రీనివాసరెడ్డి(26) గాయపడ్డారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. మండలంలోని పి.యర్రగొండ గ్రామం నుంచి శింగవరం గ్రామానికి ఒక విందు భోజనానికి వ్యాన్‌పై శింగవరం గ్రామం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో రాచపాలెం వద్ద వ్యాన్‌ నుంచి ప్రమాదవశాత్తూ వారిద్దరూ జారి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయాలై స్పృహ కోల్పోయారు. క్షతగాత్రులిద్దరినీ 108లో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేయగా తిరిగి 108లో తరలించారు. ఈ సంఘటనపై స్థానిక ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఎంఎల్‌సీ చేసి, వివరాలు నమోదు చేసుకున్నారు.

వ్యాన్‌పై నుంచి జారిపడి ఇద్దరికి తీవ్ర గాయాలు 1
1/1

వ్యాన్‌పై నుంచి జారిపడి ఇద్దరికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement