
ఎన్టీఆర్కు ఘన నివాళి
సాక్షి,పాడేరు: మాజీ సీఎం, దివంగత ఎన్టీ రామారావు జయంతిని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్తో పాటు పలుశాఖల అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మెడికల్ కళాశాల వైద్యవిద్యార్థిని శశిముఖి, ఆమె సోదరి సాయిశ్రీలతో పాటు పలువురు బాలికలు నృత్య ప్రదర్శన చేశారు. వీరందరికీ కలెక్టర్ దినేష్కుమార్, జేసీ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, డీఆర్వో పద్మలతలు బహుమతులు అందజేశారు.