ఆక్రమణలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలకు అడ్డుకట్ట

May 29 2025 7:12 AM | Updated on May 29 2025 7:12 AM

ఆక్రమ

ఆక్రమణలకు అడ్డుకట్ట

రంపచోడవరం: ఏజెన్సీలో ప్రభుత్వ భూముల అక్రమణలపై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు.రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దీంతో ఎంతో కాలంగా రోడ్డు పక్కనే చిన్న దుకాణాలు నిర్మించుకుని వ్యాపారాలు చేసుకుంటున్న వారు అధికారుల ఆదేశాలతో బేంబేలేత్తిపోతున్నారు. గతంలో అనేకసార్లు రోడ్డు పక్కన ఉన్న అక్రమణలు తొలగిస్తామని అధికారులు ప్రకటించిన ఎటువంటి తొలగింపులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమణలు తొలగించాలని నోటీసుల జారీ చేశారు. అయితే ప్రస్తుతం 48 గంటల్లో అక్రమణలు తొలగించాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి డిగ్రీ కళాశాల వరకు

ఏజెన్సీలో రోడ్డు అక్రమణల్లో భాగంగా మొదటిగా ఏజెన్సీ ప్రధాన కేంద్రం రంపచోడవరంలో అక్రమణలు తొలగించాలని భావించారు. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో అక్రమణలు స్వయంగా తొలగించుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రంపచోడవరం అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి డిగ్రీ కళాశాల వరకు ఉన్న అక్రమణలు ఎక్కువగా ఉండడంతో వాటిని తొలగించాలని ఆదేశించారు. అలాగే పందిరిమామిడి నుంచి గురుకుల కళాశాల వరకు అక్రమణలు తొలగించేందుకు నిర్ణయించారు. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి ఆర్టీసీ బస్సు స్టేషన్‌ వరకు ఉన్న రోడ్డులో అక్రమణలు ఎక్కువ కావడంతో వాహనాలు తప్పుకునే అవకాశం కూడా లేకపోతుంది. పంచాయతీ డ్రైనేజీని అక్రమించి వ్యాపారులు నిర్వహిస్తున్నారు. గతంలో అనేక సార్లు పంచాయతీ అధికారులు

అక్రమణలు తొలగించాలని చెప్పిన పెడచెవిన పెట్టారు. అలాగే రంపచోడవరం– మారేడుమిల్లి రోడ్డులో గురుకుల పాఠశాల వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. అయితే కొంత మంది వ్యాపారులకు అక్రమణలు తొలగించిన కొంత వరకు భవనాలు మిగిలే అవకాశాలు ఉన్నాయి. కొంత మందికి పూర్తిగా భవనాలు తొలిగే పరిస్ధితి ఉంది. ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటున్న తమ భవనాలు తొలగిస్తే తమ జీవనం పరిస్థితి ఏమిటనే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరంలో ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న 389 అక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. వీరంతా 48 గంటల్లో అక్రమణలను తొలగించాలని పెర్కొన్నారు. అలాగే పాత అస్పత్రి రంప చోడ్డులో కూడా అక్రమణలు ఎక్కువగా ఉండడంతో అటు వైపు కూడా అక్రమణలు తొలగింపుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రహదారికి ఇరువైపులా ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం

స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశాలు

48 గంటల్లో తొలగించని పక్షంలో

రంగంలోకి రెవెన్యూ శాఖ

శుక్రవారం నుంచి రంపచోడవరంలో ప్రారంభం

గతంలో ఇచ్చిన మార్కింగ్‌ ప్రకారమే తొలగింపు

గతంలో రోడ్లు, భవనాలు శాఖ ఇచ్చిన మార్కింగ్‌ ఆధారంగానే రోడ్డు అక్రమణలు తొలగింపు ఉంటుంది. రోడ్డుకు మధ్య నుంచి 15 మీటర్లు అటు, ఇటు అక్రమణలు తొలగింపు జరుగుతుంది. రంపచోడవరంలో అక్రమణదారులకు నోటీసులు ఇచ్చాం. 48 గంటల్లో స్వయంగా తొలగించాలని సూచించాం. అలా కాని పక్షంలో శుక్రవారం అక్రమణల తొలగింపు కార్యక్రమం చేపడతాం.

– పి రామకృష్ణ,

తహసీల్దార్‌, రంపచోడవరం

ఆక్రమణలకు అడ్డుకట్ట1
1/1

ఆక్రమణలకు అడ్డుకట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement