
రంగురాళ్ల తవ్వకాల నిరోధానికి చర్యలు
చింతపల్లి: చింతపల్లి రేంజ్ పరిధిలో గల రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాల నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు రేంజ్ అధికారి అప్పారావు తెలిపారు. చింతపల్లి డివిజన్ అటవీశాఖ అధికారి వై.వి. నరసింహారావు ఆదేశాల మేరకు జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డికొండ గ్రామ సమీపంలో గల రంగురాళ్ల క్వారీని కాంక్రీట్తో బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ఈప్రాంతంలో అపరిచితులు సంచరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. రంగురాళ్ల తవ్వకాలతో పాటు కలప అక్రమ రవాణా,వన్యప్రాణల వేట వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.