
ప్రత్యేక డీఎస్సీ కోసంఆమరణ నిరాహార దీక్ష
సాక్షి,పాడేరు: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీ సాధన కోసం వైఎస్సార్సీపీ నాయకుడు తెడబారికి సురేష్కుమార్ పాడేరు ఐటీడీఏ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ఆర్డినెన్స్ను జారీ చేసేంతవరకు దీక్షను కొనసాగిస్తానని సురేష్కుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను వెంటనే అమలుజేసి, గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక డీఎస్సీ సాధనకు సురేష్కుమార్ చేపట్టిన ఆమరణదీక్షకు పలువురు గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపి, దీక్ష శిబిరంలో కూర్చున్నారు.