
పోలవరం నిర్వాసితులను ఆదుకుంటాం..
వీఆర్పురం: పోలవరం నిర్వాసితులను ఆదుకుంటామని ఐటీడీవో పీవో అపూర్వ భరత్ అన్నారు. చింతరేగిపల్లి, రాజుపేట కాలనీ గ్రామాల్లో పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ గ్రామసభలను మంగళవారం నిర్వహించారు. గ్రామసభలో అర్హులు, అనర్హుల జాబితాను అధికారులు చదివి వినిపించారు. అభ్యంతరాలు ఉన్నవారు, జాబితాలో పేర్లు లేనివారు 15 రోజుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని పీవో సూచించారు. ఈ గ్రామ సభలో అనర్హులుగా ఉన్నవారి నుంచి దరఖాస్తు స్వీకరించి, రెండో గ్రామ సభలో పరిశీలిస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవో, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో అపూర్వ భరత్