
నేడు పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష
సాక్షి,పాడేరు: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాడేరులోని ఆరు, రంపచోడవరంలో రెండు, ఎటపాకలో ఒకటి, చింతూరులోని ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో బెంబీలు, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.పాడేరులోని ఏపీఆర్ కళాశాలతో పాటు మిగిలిన ఐదుసెంటర్లలో సౌకర్యాలను స్థానిక జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుజాత మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని 10 కేంద్రాల్లో 2,141మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు.