ఉట్నూర్రూరల్: ఉమ్మడిజిల్లాలో గిరిజన సహ కార సంస్థ ఆధ్వర్యంలో తేనె, మైనం, ఇప్పపు వ్వు, ఇప్పగింజలు,చిల్లగింజలుమొదలైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాల ని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీ ప్కుమార్ అన్నారు. గిరిజన సహకార సంస్థ ఉ ట్నూర్ డివిజన్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.డివిజన్ కార్యా లయంలో మేనేజర్లు, అకౌంటెంట్లు,సిబ్బంది తో సోమవారం సమీక్ష నిర్వహించారు. గిరిజ నుల ఉపాధి అవకాశాలు ఈ చర్యలతో మెరుగుపడుతాయన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అటవీ ఉత్పత్తుల సేకరణకు కృషి చేయాలన్నారు.నూతన డీఆర్డిపోల్లో బియ్యం తోపాటు నిత్యావసర వస్తువులు అందుబాటులోఉంచుతామన్నారు.ఇందులో సీనియర్ మేనే జర్లు సంతోష్కుమార్, తారాచంద్,రమేశ్, మ నోహర్, ఇస్తారి, లక్ష్మణ్, సిబ్బందిపాల్గొన్నారు.


