పంచాయతీల అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి జిల్లాలోని ఆయా పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన 54 మంది గెలుపొందడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సంబరా లు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎ న్నికై న సర్పంచ్లను సన్మానించి అభినందనలు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి, ప్ర జా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇందులో నాయకులు దయాకర్, సంతోష్, కార్తీక్, సన్నీ, రవి, దినేష్ మటోలియా, లాలా మున్నా, దత్తు పాల్గొన్నారు.


