
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాత్నాల: పరిహారం చెల్లించాకే భూసేకరణ చే పట్టాలని కామాయి, యాపల్గూడ రైతులు తహసీల్దార్ విశ్వనాథ్కు గురువారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రేణు క సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తమ భూములివ్వాలంటే సర్వే నంబర్–82లో ఎకరానికి రూ.30 లక్షల చొప్పున ఇచ్చినా, లేదా.. ఎంత భూమి కోల్పోతున్నామో.. అంత వ్యవసాయ భూమి కొనిచ్చినా అంగీకరిస్తామన్నారు. లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. గంగన్న, గోల్కొండ రమేశ్, కస్తూరి ర మేశ్, గండ్రత్ రాజేశ్వర్, రమేశ్ పాల్గొన్నారు.