
ప్రశాంతంగా సర్టిఫికెట్ల పరిశీలన
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని కేజీబీవీల్లోగల ఖాళీ పో స్టుల భర్తీకి గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్రూరల్ మండల వి ద్యాధికారి నర్సయ్య, మహేందర్రెడ్డి, సూపరింటెండెంట్ వేణుగోపాల్వర్మ, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ, రమేశ్ తదితరులు ప్రక్రియ ప ర్యవేక్షించారు. జిల్లాలో సీఆర్టీ గణితం, ఫిజికల్ సై న్స్, బయోసైన్స్, పీఈటీ, పీజీసీఆర్టీ బాటనీ, పీజీ సీఆర్టీ నర్సింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి పే ర్కొన్నారు. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 1:1 జాబితాను త్వరలో ప్రకటిస్తామని వివరించారు.