కరీంనగర్‌ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్‌

Jul 11 2025 5:53 AM | Updated on Jul 11 2025 5:53 AM

కరీంనగర్‌ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్‌

కరీంనగర్‌ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్‌

కరీంనగర్‌క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్‌చల్‌ చేసిన అఘోరి శ్రీనివాస్‌ గురువారం కరీంనగర్‌ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్‌పల్లికు చెందిన శ్రీనివాస్‌తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్‌ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్‌ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్‌ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్‌పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్‌ను పీటీ వారెంట్‌ ద్వారా కరీంనగర్‌ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్‌కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్‌ విధించింది. అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement