
ఆలస్యం వెనుక.. ఆంతర్యమేమిటో?
● వర్షాకాలం ముంగింట వేసవి పనులకు టెండర్లు ● అత్యవసర నిధులు.. అద్దె వాహనానికి కేటాయింపు ● బల్దియా అధికారుల తీరుపై విమర్శలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి చేపట్టిన టెండర్ల ప్రక్రియ విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రత్యేకాధికారి పట్టించుకోకపోవడంతో బల్దియా అధికారులు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం ముంగిట వేసవి పనులకు టెండర్లు నిర్వహించడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవలే రూ.40లక్షల పనులకు టెండర్లను ఖరారు చేశారు. వాటికి సంబంధించి న సామగ్రి ఇప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా కా లేదు. తాజాగా మరో రూ.60 లక్షలతో కూడిన సామగ్రి,నీటి సరఫరాకు టెండర్లు పిలువడం వె నుక ఆంతర్యమేమిటనే సందేహాలు వినిపిస్తున్నా యి. సమ్మర్ సీజన్ పేరిట నిధుల స్వాహా కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది లా ఉంటే అత్యవసరమైన తాగునీటి సమస్య కోసం వెచ్చించాల్సిన నిధులను ఓ అధికారి వా హనం అద్దె చెల్లించేందుకు కేటాయింపులు చేయ డం విమర్శలకు తావిస్తోంది.
వర్షాకాలం ముంగిట టెండర్లు..
జిల్లాలో మూడు, నాలుగు రోజులుగావిస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి కూడా ఈసారి ముందుగానే పలకరిస్తుందని అధికారులు చెబు తున్నారు. ప్రస్తుతం లాండసాంగ్వి పంపుహౌస్ నుంచి నిత్యం 12 ఎంఎల్డీల నీటి సరఫరా జరుగుతుందని, పట్టణంలో నీటి సమస్య ఎక్కడా లేదని బల్దియా అధికారులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సమ్మర్ సీజన్ కోసం కేటాయించిన అత్యవసర (15వ ఆర్థిక సంఘం) నిధులకు సంబంధించి రూ.60.50 లక్షల టెండర్లు ఇంత ఆలస్యంగా నిర్వహించడమేంటనే ప్రశ్న తలెత్తుతుంది. ఇందులో రూ.15.50 లక్షలతో చేతిపంపుల సామగ్రి సరఫరా, రూ.25 లక్షలతో బోర్వెల్స్ డ్రిల్లింగ్, పంపుసెట్ మోటార్లకు, మరో రూ.20 లక్షలతో ఆయా కాలనీలకు నీటి సరఫరా నిమి త్తం టెండర్లు ఆహ్వానించిన అధికారులు వీటిని శనివారం తెరిచారు. ఇందులో రూ.40.50 లక్షల సామగ్రి సరఫరాకు సంబంధించిన టెండర్ ఖరా రు చేస్తూ ఓ గుత్తేదారుకు కేటాయించారు. మరో రూ.20 లక్షల బోర్వెల్స్, మోటార్ల సరఫరాకు సంబంధించి టెండర్ను రీకాల్ చేస్తున్నట్లుగా వె ల్లడించారు. వేసవిముగింపు దశకు చేరడం, ఎక్క డా నీటి సమస్య అంతగా లేకపోయినా టెండర్ల కేటాయింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అత్యవసర నిధులు అధికారి వాహన అద్దెకు..
పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు వె చ్చించాల్సి ఉంటుంది. అయితే బల్దియా అధికా రులు అందుకు భిన్నంగా ఓ అధికారి వాహన అద్దె చెల్లించేందుకు నిధులు కేటాయింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ఇతర అభివృద్ధి ప నులు పర్యవేక్షించేందుకు గాను వాహనాన్ని అద్దె కు వినియోగిస్తూ దానికి ఈ నిధులు చెల్లించేలా టెండర్లలో పొందుపరిచారు. నెలకు రూ.33వేల చొప్పున ఏడు నెలలకు గాను రూ.2.31 లక్షలు వెచ్చించనున్నట్లుగా అందులో పేర్కొన్నారు. సాధారణంగా అధికారుల వాహనాల అద్దె జనరల్ ఫండ్, ఇతర నిధుల నుంచి వినియోగించాల్సి ఉంటుంది.
ఈవిషయమై మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును ఫోన్లో సంప్రదించగా.. తాను కార్యాలయానికి వెళ్తున్నానని, వెళ్లాక వివరాలు చెబు తానని పేర్కొన్నారు. ఇదే విషయమై మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజును సంప్రదించగా.. తాను మీటింగ్లో ఉన్నానని, మళ్లీ మాట్లాడతానంటూ పేర్కొనడం గమనార్హం.